Digital Kasipet:-
విద్యార్థులు పరీక్షల సమయంలో మనల్ని మనం ప్రోత్సహించు కుంటూ ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం సాధిస్తారని ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దినేని అర్జున్ విద్యార్థులకు తెలిపారు. గురువారం కాసిపేట మండలం రేగుల గూడెం గిరిజన బాలురు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఎలా సంసిద్ధత కావాలనే అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్య నేర్చుకోవడం వల్లనే సమాజంలో గౌరవం లభిస్తుందని విద్యార్థులు నిరంతరం చదువుకుంటూనే ఉండాలని అన్నారు. ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుందని లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా చదువుతే తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు. లక్ష్యం పెట్టుకుని జీవించేవారు లీడర్ అవుతారని, అక్షరం లేకుండా తిరిగే వారు లేబర్ గా మిగులుతారని విద్యార్థులకు తెలిపారు.